ఇక ప్రస్తుతం ఈ టీవీ ప్లాన్ చేసిన స్పెషల్ సంక్రాంతి ప్రోగ్రాం లో కూడా అత్త పాత్రలో రోజా చేయగా ఇక ముగ్గురు అల్లుళ్ళుగా.. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, ఇమాన్యుయల్ చేస్తారు. ఈ క్రమంలోనే వీరందరూ కూడా తమదైన పంచులతో అదరగొడుతు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమోలు మూడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇటీవలే ఈ టీవీ యాజమాన్యం మరో ప్రోమో విడుదల చేసింది. ఇక ఈ ప్రోమో మొత్తం ఎంతో ఫన్నీగా అయిపోయింది అని చెప్పాలి.
కానీ ఇక సింగర్ మధుప్రియ పాడిన పాట తో మాత్రం అందరూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అనే చెప్పాలి. ప్రస్తుత సమాజంలో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. జరుగుతున్న ఘటనలను ఉద్దేశిస్తూ కడుపులో బిడ్డ కదిలాడుతుండగా ఆ సమయంలో అమ్మ ఆనందపడుతుంది అంటూ మొదలు పెట్టిన పాట... అందరితో కంటనీరు పెట్టించింది. ఇక యాంకర్ అనసూయ అయితే బోరున ఏడ్చేసింది. అంతేకాదు ఆడపిల్లను కనటం అనేది తల్లి తప్పు కాదని అందరూ అర్థం చేసుకోవాలి అంటూ ఏడుస్తుంది యాంకర్ అనసూయ.