"చిత్రం" ఈ సినిమా గురించి ఇప్పుడు అప్పుడే ఎవరూ మరిచిపోలేరు.ఈ సినిమా విడుదలై దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఉదయ్ కిరణ్ సినీ ఇండస్ట్రీకి ఈ సినిమా ఓ మైలురాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ కు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. సినిమా విడుదల అయ్యే వరకు అసలు ఈ చిత్రం అనేది ఒకటి ఉంది అనే విషయం ఎవరికీ తెలియకుండా ఎంతో సీక్రెట్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు తేజ.

తేజ ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సినిమా మంచి విజయం సాధించడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో జయం, నువ్వు నేను సినిమాలు భారీ విజయం అందుకోవడంతో తేజ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.2000 సంవత్సరంలో విడుదలైన చిత్రం సినిమాకు ఇన్ని సంవత్సరాల తర్వాత సీక్వెల్ చిత్రం చేయాలనే ఆలోచనలో దర్శకుడు తేజ ఉన్నట్లు తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేశారు.

చిత్రం 1.1 పేరుతో చిత్రంకి సీక్వెల్ ప్రకటించాడు ఈ దర్శకుడు. ఇందులో 45 మంది కొత్త వాళ్లను పరిచయం చేయబోతున్నాడు దర్శకుడు. ఈ సీక్వెల్ సినిమాలు హీరో హీరోయిన్లు అందరూ కూడా కొత్త వాళ్లే.చాలాకాలం నుంచి సంగీతానికి దూరంగా ఉన్న ఆర్.పి.పట్నాయక్ ప్రస్తుతం తేజ కోసం ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అప్పట్లో చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ ను పరిచయం చేసిన తేజ ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా చేయటానికి ఉదయ్ కిరణ్ మన మధ్యన లేకపోవడంతో అలాంటి హీరో కోసం వెతుకుతున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని బయట వారికి కాకుండా తన కొడుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన సినిమా ద్వారా తేజ తన కొడుకు ను లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు.ఇప్పటికే తన కొడుకుకి నటనలో శిక్షణ ఇచ్చిన తేజ ముందుగా తన కొడుకుతో షూటింగ్ నిర్వహించిన తరువాత తన కొడుకుని తీసుకోవాలా వద్దా డిసైడ్ చేస్తారు అని తెలియజేశారు. తనకు నచ్చకపోతే మరొక హీరో వేటలో పడతారు తేజ. ఇదే దర్శకుడు తేజ స్టైల్.

మరింత సమాచారం తెలుసుకోండి: