ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఓ పక్క తన స్టైల్ లో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టె రికార్డులు సాధిస్తూ.. మరోపక్క సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిస్తూ ఎంతో లాభపడుతున్నాడు. రీసెంట్ గా సుకుమార్ మైత్రి మూవీస్ తో కలిసి 'ఉప్పెన' సినిమాను నిర్మించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంది.. ఇక ఈ సినిమాతో తన శిష్యుడు బుచ్చిబాబు సానాని దర్శకుడిగా పరిచయం చేశాడు సుకుమార్. అయితే ఈ సినిమాకి ఆర్థికంగా సుకుమార్ ఎలాంటి పెద్దగా సాయం చెయ్యలేదు. సినిమాపై పెట్టుబడి మొత్తం మైత్రి సంస్థ నిర్మాతలే పెట్టుకున్నారు.కానీ సుకుమార్ పర్యవేక్షణలో ఈ సినిమాను తెరకెక్కించడంతో సినిమాకి వచ్చిన లాభాల్లో యాభై శాతం తనకు వచ్చేలా డీల్ మాట్లాడుకున్నారు ఈ క్రియేటివ్ డైరెక్టర్.



ఈ సినిమాపై సుక్కు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని కొన్ని సన్నివేశాల్లో మార్పులు, చేర్పులు కూడా చేశారు. సినిమా థియేటర్లోకి వచ్చే వరకు సుకుమార్ ఎంతో కేర్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. లాంగ్ రన్ లో సినిమా రూ.50 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మంచి డీల్ కుదిరింది. ఈ సినిమాతో నిర్మాతలకు ఎలా లేదన్నా.. రూ.40 కోట్లు లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందులో సగం మొత్తం అంటే రూ.20 కోట్లు సుకుమార్ కి దక్కనున్నాయి.


ఇరవై కోట్లు అంటే చిన్న విషయం కాదు.. సుకుమార్ ఒక సినిమాను డైరెక్ట్ చేయడానికి ఇంత మొత్తం తీసుకుంటారు. అలాంటిది దర్శకత్వ పర్యవేక్షణ చేసి ఈ రేంజ్ లో లాభాలు ఆర్జించారు. ఈ సినిమా తీసుకొచ్చిన లాభాలతో నిర్మాతలు.. దర్శకుడు, హీరో, హీరోయిన్లకు విలువైన బహుమతులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.ఇక మొత్తానికి తన శిష్యుడిని రంగంలో దింపి అతనికి మంచి లైఫ్ ఇచ్చి సుకుమార్ కూడా భారీగానే లాభపడ్డాడు.ఇక సుకుమార్ పుష్ప సినిమా విషయానికి వస్తే ఆ సినిమాని ఒక రేంజిలో చెక్కుతున్నాడట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: