మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల ఫస్ట్ కలయికలో తెరకెక్కతున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కొరటాల శివ తీస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. చరణ్ ఈ సినిమాలో సిద్ద అనే నక్సలైట్ పాత్ర చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ గా నటిస్తున్నట్లు సమాచారం. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల చరణ్, చిరంజీవి కలిసి పాల్గొన్న పలు సన్నివేశాలను మారేడుమిల్లో ప్రాంతంలో యూనిట్ చిత్రీకరించింది. 

ఇక నిన్నటితో ఆచార్య కు సంబంధించి తన పోర్షన్ షూట్ మొత్తం పూర్తి అవడంతో రామ్ చరణ్, ఆచార్య యూనిట్ కి వీడ్కోలు పలికి హైదరాబాద్ వెళ్లిపోయారు. తొలిసారిగా తన తండ్రి తో కలిసి నటిస్తున్న సినిమా కావడంతో తనకు కొంత ఎగ్జైటింగ్ గా ఉన్నప్పటికీ మూవీ యొక్క స్క్రిప్ట్ పై తనకు ఎంతో నమ్మకం ఉందని, తప్పకుండా మూవీ సూపర్ హిట్ అందుకుంటుందని చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా తొలిసారిగా తండ్రి, తనయులిద్దరు కలిసి నటించే అవకాశం లభించింది. అయితే దీని తరువాత ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక భారీ సినిమా చేయనున్నారు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక యువ సైంటిస్ట్ పాత్ర చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. నిజానికి దీనిపై యూనిట్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక న్యూస్ బయటకు రానప్పటికీ, ఈ సినిమా యొక్క కథలో ఒక కీలకమైన రోల్ ఉందని, కథని ముఖ్యమైన మలుపు తిప్పే ఆ పాత్రలో పవర్ స్టార్ నటించే ఛాన్స్ కూడా లేకపోలేదని కొందరు అంటున్నారు. అయితే దీనిపై పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలంటే స్వయంగా ఈ మూవీ యూనిట్ దీనిపై స్పందించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: