ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’  అంత్యంత భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా మొదటి నుంచి ఎంతో సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ వస్తుంది. ఈ సినిమా వేరే భాషలో రైట్స్ కోసం పోటీలు పడుతున్నారు. మొన్నటి మొన్న బాలీవుడ్ లో అత్యంత పారితోషికం ఇస్తామని ముందుకు వచ్చారు అక్కడి నిర్మాతలు.


బాహుబలి షూటింగ్ లో రాఘవేంద్ర రావు సలహాలు తీసుకుంటున్నరాజమౌళి. చిత్రంలో ప్రభాస్, రాణ


తాజాగా తమిళ రైట్స్ ని టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అయిన యువి క్రియేషన్స్ వారు భారీ ప్రైజ్ కి కొనుక్కున్నారు అని ఇది వరకే తెలియజేశాం. తాజాగా వాళ్ళు ఎంత అమౌంట్ కి ఈ రైట్స్ ని దక్కించుకున్నారు అనేది మీకు తెలియజేయనున్నాం. పలు తెలుగు, తమిళ ప్రొడక్షన్ సంస్థల మధ్య జరిగిన గట్టి పోటీలో యువి క్రియేషన్స్ వారు సుమారు 36 కోట్లకి తమిళ్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఒక డబ్బింగ్ సినిమాకు ఇంత రేటు పలకడం అంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుందంటే నమ్మండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి హీరోలుగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాపై  ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: