అయితే ఇప్పటికే వేదాళం సినిమా షూటింగును మొదలు పెట్టినట్లు తెలుస్తోంది, అది కూడా కేవలం చిరంజీవి లేని సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆచార్య సినిమా అనంతరం చిరంజీవి కూడా షూటింగులో పాల్గొననున్నారు. అయితే తాజాగా వేదాళం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది. మాములుగా వేదాళం సినిమా కోలకతా నేపథ్యంలో జరగనుంది. సోదరితో కలిసి కోల్ కత్తా వెళ్లిన హీరోకు అక్కడి రౌడీ గ్యాంగ్ కుమద్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో వేదాళం రూపొందింది.
రీమేక్ లో మాత్రం లొకేషన్ ను మారుస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ కేరళ నేపథ్యంలో సినిమాను చిత్రీకరించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత మెల్ల మెల్లగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనధికారిక సమాచారం. కేరళకు తగినట్లుగానే కథలో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే హీరో సోదరి విషయంలో కూడా కొన్ని మార్పులుంటాయని తెలుస్తోంది. చిరంజీవి ఆచార్య సినిమా ను వచ్చే నెలలో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ నెలలోనే ఆచార్య కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి