టాలీవుడ్లో వైవిధ్యభరితమైన సినిమాలు చేసే అడవి శేష్ ప్రస్తుతం పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్నాడు.. అయన హీరో గా చేస్తున్న మేజర్, హిట్ సీక్వెల్ లు ప్రస్తుతం రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఆయన తర్వాత హీరో గా మారాడు.. కర్మ సినిమా తో వచ్చిన అడవిశేష్ పవన్ కళ్యాణ్ పంజా సినిమాతో మంచి పాపులారిక్ దక్కించుకున్నాడు. ఆ సినిమాలో సైకో విలన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అది తర్వాత బలుపు చిత్రంలో కూడా విలన్ గాచేశాడు.

ఓవైపు ప్రత్యేక పాత్రలు పోషిస్తూనే హీరోగా చేస్తూ వచ్చాడు శేష్..క్షణం సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. అది సినిమాలో శేష్ నటనకు అందరు ఫిదా కాగా, గూఢచారి తో హీరో గా నిలదొక్కుకున్నాడు అడవిశేష్.. అది సినిమా సూపర్ హిట్ కావడంతో వెరైటీ చిత్రాల హీరోగా ఎదిగాడు..అయన కెరీర్లో వచ్చిన ఎవరు సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ లో మేజర్ సినిమా చేస్తుండగా, నాని నిర్మాణంలో హిట్ సీక్వెల్ సినిమా చేస్తున్నాడు..

ఈనేపథ్యంలో అడవి శేష్ సినిమా సెలెక్షన్స్ ని చూసి టాలీవుడ్ హీరో లునేర్చుకోవాలనే వాదన ప్రేక్షకుల నుంచి ఎక్కువవుతుంది..మూస పద్ధతి ని వదిలి ఇలాంటి వెరైటీ సినిమాలుచేయాలని హీరోలకు సూచనలుఇస్తున్నారు ప్రేక్షకులు.. ఇక శేష్ నటించిన మేజర్ చిత్రం 26/11 ముంబై టెర్రరిస్టుల దాడుల్లో వీరమరణం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (జీఎంబీ ఎంటర్టైన్మెంట్) మరియు ఏ+ఎస్ మూవీస్ సంస్థల సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉగాది సందర్భంగా తెలుగు మలయాళ హిందీ భాషల్లో విడుదలైన 'మేజర్' టీజర్ విశేష స్పందన తెచ్చుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: