బిల్ గేట్స్ తాజాగా తన భార్య మెలిండా గేట్స్తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల సుదీర్ఘ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు బిల్-మెలిండా గేట్స్లు సంయుక్తంగా ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ క్రమంలోనే బిల్ గేట్స్ పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు విడిపోవడంపై ఎమోషనల్ పోస్ట్లు పెట్టారు.
ఇక ఆర్జీవీ కూడా గేట్స్ దంపతులు విడిపోవడంపై ఈ రోజు ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందుల్లో ఇదొకటి. భార్యభర్తలే ఒకరికొకరు తలనెప్పిగా మారతారు’ అని రాసుకొచ్చారు. దానికి చెన్నై మీమ్స్ అనే ఓ ఫేస్బుక్ పేజ్లోని ఓ పోస్ట్ను కూడా జత చేశాడు. ఆ పోస్ట్లో రెండు ఫోటోలున్నాయి. కాగా.. ఆర్జీవీ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనికి దాదాపు 2వేలకు పైగా లైక్స్ రాగా.. వందల సంఖ్యలో రీట్వీట్లు కూడా అయ్యాయి. ఈ ట్వీట్కు ముందు ఆర్జీవీ కరోనాకు సంబంధించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని అద్భుతమైన ట్వీట్లు చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి