సినిమా ఇండస్ట్రీ అన్నాక విభేదాలు, గొడవలు అనేవి కామన్. ఒక దర్శకునితో కథ విషయంలో విభేదాలు వచ్చి లేదా అతని పని తీరులో విభేదాలు వచ్చి సినిమాలు క్యాన్సిల్ చేసుకోవడం సర్వ సాధారణం. అలా చాలా మంది హీరోలకు దర్శకులకు మధ్య విభేదాలు, గొడవలు అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త కొత్త దర్శకులని పరిచయం చేశాడు నాగార్జున. అలా ఎంతోమంది దర్శకులకి లైఫ్ ఇచ్చాడు. అందువల్ల నాగార్జున అంటే ఇండస్ట్రీలో దర్శకులకి మంచి గౌరవం వుంది.కింగ్ నాగార్జున ఎలాంటి సినిమా చేయాలన్నా కూడా సినిమా స్టోరీ కంటే ముందు ఆయనకు దర్శకుడి పనితీరు నచ్చాలి.ఆ దర్శకుడు ఆయనకు బాగా నచ్చినట్లు అయితే సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. అందుకే నాగార్జున కొత్త దర్శకులతో ఎక్కువగా పని చేస్తుంటారు. నాగార్జునను మెప్పించ గలిగితే చాలు ప్లాప్ లో ఉన్నా కూడా ఏమి పట్టించుకోరని చెబుతుంటారు.


అయితే ఇటీవల ఒక జాతీయ అవార్డు దక్కించుకున్న టాలెంటెడ్ దర్శకుడు ముందు కథ చెప్పిన తరువాత అంత ఒకే చేసుకున్నాక నాగార్జునతో కొన్ని విషయాల్లో విభేదించినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. గరుడవేగా సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రవీణ్ సత్తారు.ఈ దర్శకుడు కథ చెప్పగానే అన్ని నాగార్జున నిర్ణయాల ప్రకారమే ప్లాన్ సెట్ చేసుకున్నాడట. ఇక ఇటీవల స్క్రిప్ట్ విషయంలో కొన్ని విబేధాలు వచ్చినట్లు టాక్ వచ్చింది. నాగార్జున ప్రాజెక్టును కొంచెం పక్కన పెట్టినట్లు సమాచారం అందుతుంది.ఇక నాగార్జున తదుపరి సినిమాగా బంగార్రాజును తీసుకురావాలని మరోక న్యూ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఆ సినిమా తరువాతే మరో సినిమా గురించి ఆలోచించాలని అనుకుంటున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది.


మరింత సమాచారం తెలుసుకోండి: