సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్ లు కొంత ఏజ్ వచ్చేవరకు సినిమాలు చేసి ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సడన్ గా సినిమాలు మానేసి పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోతుంటారు. మళ్లీ ఎప్పుడో రీఎంట్రీ టైంలో గానీ వారి గురించి ఒక వార్త కూడా బయటకు రాదు. మధ్యలో వారికి పాప పుట్టిందని, బాబు పుట్టాడు అని కొన్ని వార్తలు వస్తాయి. ఇంకొంతమంది హీరోయిన్ ల గురించి అసలు ఎలాంటి సమాచారం కూడా ఉండదు. వారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు అనే విషయాలు ఎంతో గోప్యంగా ఉంచుతారు సదరు హీరోయిన్లు. అలా సౌత్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రీమా సేన్.
 ఆమె సినిమాలు మానేసిన దగ్గర నుంచి పెళ్లయి ఎక్కడ నివాసం ఉంటుంది అనే విషయాలు చాలావరకు గోప్యంగా ఉంచుతూ వచ్చింది. కారణం తెలియదు కానీ ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో అన్న విషయం కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రీమాసేన్ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది. బావ నచ్చాడు, మనసంతా నువ్వే, సీమ సింహం, అంజి బంగారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఆమె కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఏది అంటే యుగానికొక్కడు అని చాలా సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలకు దూరమైన తరువాత ఆమె 2012లో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అయిన శివ‌క‌ర‌ణ్ సింగ్‌ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.క‌ర‌ణ్‌సింగ్ ఓ ప్ర‌ముఖ రెస్టారెంట్స్ గ్రూప్స్‌కు అధినేత‌. ఈయ‌న‌కు ప్ర‌తి రాష్ట్రంలోనూ రెస్టారెంట్లు ఉన్నాయి. రిమాసేన్‌ను తొలి చూపులోనే ప్రేమించిన క‌ర‌ణ్‌సింగ్ 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట కి ఒక ఏడేళ్ల బాబు ఉన్నాడు.  ఏదేమైనా ఇంత ఎంజాయ్ లైఫ్ ను అనుభవిస్తున్న రీమాసేన్ సినిమాల తర్వాత తన గురించి వార్తలు బయటికి రాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు. ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: