ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఇక ఆ తర్వాత ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయాడు. ఇక గీత గోవిందం సినిమా తో స్టార్ హీరోగా మరింత క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి ఇక రౌడీ హీరో తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెలుగు చిత్రపరిశ్రమకు దొరసాని అనే సినిమాతో పరిచయం అయ్యాడు.



 మొదటి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.  పరువు హత్యల నేపధ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమా అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్  అనే  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆనంద్  దేవరకొండ. ఇక ఈ సినిమా కూడా  మంచి టాక్ సొంతం చేసుకుని విజయం సాధించింది.  ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన పుష్పక విమానం అనే సినిమాలో నటిస్తున్నాడు.



 ఇక ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పోవడంతో ఇక ఈ సినిమా ఓటిటి లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో  ఆనంద్ దేవరకొండ సరసన గీత్ సైని - శాన్వి మేఘన అనే ఇద్దరు హీరోయిన్స్ నటించారు.  సినిమాలో సునీల్ కూడా కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. అయితే ఈ సినిమా ఓ టి టి లో రాబోతుంది అన్న టాక్ ఎంతవరకు నిజం అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: