మొదటి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పరువు హత్యల నేపధ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమా అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఈ సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుని విజయం సాధించింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన పుష్పక విమానం అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పోవడంతో ఇక ఈ సినిమా ఓటిటి లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన గీత్ సైని - శాన్వి మేఘన అనే ఇద్దరు హీరోయిన్స్ నటించారు. సినిమాలో సునీల్ కూడా కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. అయితే ఈ సినిమా ఓ టి టి లో రాబోతుంది అన్న టాక్ ఎంతవరకు నిజం అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.