టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ మంచి క్రేజ్ ఉన్న కాంబినేషన్.అల్లుఅర్జున్ తో సినిమా చేసేటప్పుడు సుకుమార్ చాలా ఎనర్జెటిక్ గా చేస్తాడు. సుకుమార్ అల్లుఅర్జున్ తోనే తన మొదటి సినిమా ఆర్య ను చేసాడు.ఈ  సినిమాతో యూత్ లో అల్లుఅర్జున్ కు మంచి  క్రేజ్ వచ్చింది. సుకుమార్ తాను తీసే సినిమాలో మంచి క్రియేటివ్ గా టైటిల్స్ వేయడం చేస్తాడు. సుకుమార్ సినిమాలు ఎప్పుడు చాలా క్రియేటివ్ గా ఉంటాయి. సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. సుకుమార్ ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది.సుకుమార్ ఐటమ్ సాంగ్ తో సినిమాకు మంచి క్రేజ్ తీసుకొని వస్తాడు. సుకుమార్ తీసే సినిమాలు మిగతా దర్శకులు తీసే సినిమాలకు చాలా భిన్నంగా ఉంటాయి.


ఆర్య సినిమా తరువాత మహేష్ తో  సినిమా చేయాలనీ సుకుమార్ చాలా  ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో జగడం సినిమా కథను మహేష్ కు వినిపించాడు. ఆ కథ మహేష్ కు అంతగా నచ్చకపోవడంతో ఆ సినిమాను రామ్ తో  చేయడం జరిగింది. మహేష్ కు నచ్చకపోవడంతో ఆ కథలో కొన్ని మార్పులు చేసి రామ్ తో తెరకెక్కించడం జరిగింది. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ మహేష్ తో ఒక సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకున్నాడు. ఆ కోరిక వన్ నేనొక్కడినే సినిమాతో తీరింది. వన్ నేనొక్కడినే సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీసాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా హిట్ కాకపోయినా సుకుమార్ టేకింగ్ మాత్రం చాలా బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు.

ఆ తరువాత  సుకుమార్ రాంచరణ్ తో రంగస్థలం సినిమా చేసాడు  ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఈ భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. తన తరువాత సినిమా మళ్ళీ మహేష్ తో చేయాలి అనుకున్నాడు. కానీ కథ నచ్చకపోవడంతో మహేష్ తో తీయాల్సిన సినిమాను కొన్ని మార్పులు చేసి బన్నీతో తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమానే పుష్ప.ఈ సినిమా ముందు ఒక భాగం అనుకున్న చివరికి రెండు పార్టులుగా చేయడం జరిగింది. పుష్ప సినిమా చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన తిరిగి ప్రారంభం అయింది. ఇదిలా ఉండగా పుష్ప సినిమాకు మళ్ళీ బ్రేక్ పడనుందట.డైరెక్టర్ సుకుమార్ వైరల్ ఫీవర్ రావడంతో ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడిందట. వైరల్ ఫీవర్ తగ్గగానే తిరిగి మళ్ళీ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: