టాలీవుడ్ పాన్
ఇండియా స్టార్
రెబల్ స్టార్ ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు సెట్స్ పై ఉంచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలను చేస్తూ తాను ఎంత బిజీగా ఉన్నా డో చెబుతున్నాడు. వీటిలో ముందుగా
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే
శ్యామ్ సినిమా విడుదల కానుంది. ఈ
సినిమా విడుదలైన కొన్ని నెలల తేడాతోనే
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ అనే
సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ
సినిమా కూడా పాన్
ఇండియా సినిమా విడుదల అవుతుండటం విశేషం.
ఇకపోతే
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ చేస్తున్న
సినిమా ఆదిపురుష్
సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది.
బాలీవుడ్ స్టార్
హీరోయిన్ కృతిసనన్ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుండగా స్టార్
హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ
సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు దర్శకుడు ఓం రౌత్. రామాయణం ఆధారంగా ఈ
సినిమా తెరకెక్కబోతుంది అని అంటున్నారు. ఇక
ప్రభాస్ మహానటి ఫేమ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను కూడా ఇటీవలే మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతోనే పాన్ వరల్డ్
సినిమా ట్రెండ్ ను కూడా మొదలు పెడుతున్నాడు ప్రభాస్. దీపికా పడుకునే
హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై
నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడం విశేషం. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించిన దర్శకుడు ఈ శనివారం గురుపౌర్ణమి సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో
ప్రభాస్ బిగ్ బీ పై క్లాప్ కొట్టడంతో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకి ప్రాజెక్ట్ కే అనే పేరును వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించగా ఇది ఒరిజినల్ టైటిల్ కు కూడా బాగానే ఉంటుందని చెప్తున్నారు అభిమానులు.
ప్రభాస్ ను ఈ టైటిల్ నే పెట్టమని, బాగుంటుందని కోరుతున్నారు.