టాలీవుడ్
సినీ పరిశ్రమ లో స్టార్ గా వచ్చి స్టార్
హీరోయిన్ గా ఎదిగిన
హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క
సాయి పల్లవి అని చెప్పవచ్చు.
ఫిదా సినిమా చేయడానికి అంటే ముందు ఆమె మలయాళ సినీ పరిశ్రమలోనే కాకుండా
టాలీవుడ్ లో కూడా స్టార్. ఎందుకంటే ఆమె క్రేజ్ మలయాళం నుంచి తమిళం నుంచి తెలుగు కూడా ఒక్క
సినిమా చేయకుండానే పాకింది. మలయాళ సినీ పరిశ్రమలో వచ్చిన
ప్రేమమ్ సినిమాలో ఆమె చేసిన నటన యావత్ సౌత్ మొత్తం ను మెప్పించింది.
ఆ తర్వాత ఆమె
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
వరుణ్ తేజ్ హీరోగా నటించిన
ఫిదా సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఆమెకు ఉన్న క్రేజ్ మరో రేంజ్ కి వెళ్ళిపోయింది అని చెప్పాలి. చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెను
హీరోయిన్ గా పెట్టి
సినిమా తీయాలని కోరుకునేవారు. మిడిల్ క్లాస్ మెలోడీస్, పడి పడి లేచే మనసు వంటి సినిమాలతో తెలుగులో దూసుకుపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో
లవ్ స్టోరీ అనే
సినిమా ఉంది. అలాగే విరాటపర్వం,
శ్యామ్ సింగ రాయ్ అనే భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఆమె చేస్తుంది. ఈ సినిమాలు విడుదలైతే ఆమె తెలుగులో నెంబర్ వన్
హీరోయిన్ గా ఎదగడం ఖాయం.
తనకే సొంతమైన ఎవరికీ సాధ్యం కానీ హావభావాలతో నటిస్తూ రోజు రోజుకి దూసుకుపోతుంది.
సాయి పల్లవి ఏ
సినిమా పరిశ్రమలో అయినా దూరంగా ఉంటూ తన పాత్రలను ఎంపిక చేసుకుంటూ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వస్తుంది. పాత్ర డిమాండ్ చేస్తే గాని ఆమె గ్లామర్ షో చేయడానికి ఒప్పుకోదు కానీ ఇంతవరకూ ఆమె చేసిన ఏ పాత్ర గ్లామర్ షో చేయడానికి డిమాండ్ చేయలేదు. నిజానికి ఆమె గ్లామర్ షో చేసిన దాఖలాలు అయితే లేవు. మరి భవిష్యత్తులో వచ్చే సినిమాలు ఆమె అభిప్రాయాన్ని మారుస్తాయా లేదా అనేది చూడాలి. ఏదేమైనా
సాయి పల్లవి సౌత్
సినిమా ఇండస్ట్రీని మహారాణిగా భవిష్యత్తులో ఏలడం ఖాయమని చెప్పవచ్చు.