ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ కళకళలాడుతుంది. ఇతర భాషల సినిమాలు టాలీవుడ్ సినిమాలు అన్ని హైదరాబాద్ లో షూటింగ్ చేసుకోవడంతో మునుపటిలా షూటింగ్ లతో స్టూడియోలు ఫుల్ బిజీగా ఉన్నాయి. మాస్ అభిమానులకు ఎంతగానో నచ్చే సీన్లు అంటే యాక్షన్ సీన్ లు.  ఒక సినిమాలో ఫైట్ లు అంటే మాస్ అభిమానులకు ఎంతో ఇష్టం అని చెప్పవచ్చు. ఆ విధంగా యాక్షన్ సినిమాల్లో మన హీరోలు నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో కనువిందు చేస్తున్నారు. అలా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో మన హీరోలు యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలు ఏంటో ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఓరియంటెడ్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుండగా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను చిట్టూరి సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. ఇక అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర చేస్తున్న ప్రాజెక్టు కే సినిమా కూడా ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ నేపథ్యంలో అమితాబచ్చన్ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.షూటింగ్ పూర్తయ్యాక తిరిగి ముంబైకి చేరుకోనున్నారు అమితాబ్. ఇదే కాకుండా ఫిలిం సిటీలో తాప్సి ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్ లు తెరకెక్కుతున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో మంచి విజయం అందుకున్న స్వరూప్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ఇతర నటీనటుల పై ఎన్నికల నేపథ్యంలో సాగే సన్నివేశాలు కూడా ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: