మహాసముద్రం
సినిమా విషయంలో
అజయ్ భూపతి ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాను ఓకే చేయించడానికి చాలా మంది హీరోల దగ్గరికి తిరిగాడు
అజయ్ భూపతి. కానీ ఆయన చివరికి శర్వానంద్ మరియు సిద్ధార్థ లతో సినిమాలు చేశాడు. హీరోయిన్ విషయంలో కూడా కొంతమంది టాప్ హీరోయిన్లను ప్రయత్నించి చివరికి
అదితి రావు హైదరి ని ఎంపిక చేసుకున్నాడు. వీరెవరూ కూడా స్టార్ హోదాను భారీ స్థాయిలో కలిగి ఉన్న నటీనటులు కాకపోవడంతో ఈ
సినిమా యావరేజ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అంచనాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఏదైనా
సినిమా చేయాలంటే ఆ సినిమాపై నటుల పేర్లు రాసి పెట్టి ఉండాలి అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఈ
సినిమా చేయాలని ఈ ముగ్గురు నటీనటుల పేర్లు ఉన్నాయి. వాస్తవానికి ఎలాంటి స్టార్ ఇమేజ్ లేని ఈ ముగ్గురు ఈ
సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అని చెప్పవచ్చు. శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ స్టార్
హీరో ల విషయం లో మాత్రం వెనకబడి పోయాడు. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కూడా ఈ
సినిమా భారీగా హిట్ అయింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ
సినిమా ముక్కోణపు ప్రేమకథా చిత్రం తెలుస్తుంది.
నాగ చైతన్య రవితేజ
బెల్లంకొండ శ్రీనివాస్ లు ఈ సినిమాను ఒప్పుకోకపోవడంకు కారణం కూడా ఇదే అని తెలుస్తుంది. ముక్కోణపు ప్రేమకథా చిత్రాలు గా తెలుగులో
ఆర్య ఆర్య 2 లాంటి సినిమాలు రాగా అందులో రెండో
హీరో పాత్ర పూర్తిగా నెగటివ్ గా ఉండడం లేదా పూర్తిగా సైడ్ పాత్ర లాగా ఉండటం తో ప్రేక్షకులు మెయిన్
హీరో పైనే ఫోకస్ పెట్టారు. కానీ ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలే కాబట్టి ఈ
సినిమా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ను కలిగిస్తుంది. ఏదేమైనా ఈ సినిమాను రిజెక్ట్ చేసి సదరు హీరోలు తప్పు చేశారా అని అనిపిస్తుంది.