తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటు వంటి మ్యాచో స్టార్ గోపీచంద్ , నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇక పోతే ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో హీరోలు గా నటిస్తున్నారు..? ఆ మూవీ లకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది అనే వివరాలను తెలుసు కుందాం.

గోపీచంద్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న "విశ్వం" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఇక పోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో గోపీ చంద్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు.

నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటిస్తోంది. ఎస్ జై సూర్య ఈ మూవీబ్లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ మూవీ కే హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ప్రస్తుతం ఈ రెండు మూవీ ల చిత్రీకరణ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc