గోపీచంద్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న "విశ్వం" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఇక పోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో గోపీ చంద్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు.
నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటిస్తోంది. ఎస్ జై సూర్య ఈ మూవీబ్లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ మూవీ కే హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.
ఇలా ప్రస్తుతం ఈ రెండు మూవీ ల చిత్రీకరణ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.