అక్కినేని హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే పలు మార్లు వాయిదా పడడంతో ఈ సినిమా వస్తుందా రాదా అన్న అనుమానాన్ని వెళ్ళబుచ్చగా చివరికి సెప్టెంబర్లో ఈ సినిమా విడుదలై మొదటి రోజు నుంచి ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

సినిమా హిట్ ఒక్కసారిగా అక్కినేని నాగ చైతన్య కు మంచి జోష్ ఇచ్చినట్లు అయ్యింది. ఈ జోష్ లోనే ఆయన తన తదుపరి సినిమా చిత్రీకరణకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య థాంక్యూ అనే ఓ విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు.  రాశి ఖన్నా  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లే అని తెలుస్తుంది.  అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను రీ షూట్ చేయాలని హీరో చైతు దర్శకుడు కి సూచించాడట.

లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించి తీరాలని నాగచైతన్యసినిమా విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు. అందుకే ఈ సినిమాలోని బాగా లేని కొన్ని సీన్లను రీ షూట్ చేసి ప్రేక్షకుల ముందుకు ఓ మంచి ఔట్ పుట్ తో రావాలని ఆయన భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బంగార్రాజు చిత్రంలో తండ్రితో కలిసి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన చేస్తున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: