టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా అలాగే తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వరుడు కావలెను. ఇక ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న విషయం తెలిసిందే.దగ్గుబాటి పుత్ర రత్నం హీరో రానా ఈ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక శేఖర్ కమ్ముల శిష్యురాలైన లక్ష్మీ సౌజన్య వరుడు కావలెను సినిమాతో గ్యారంటీగా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ట్రైలర్ చూసిన జనాలు అభిప్రాయపడుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు నాగ శౌర్య, రీతూవర్మ మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక టీజర్ లో, ప్రమోషన్స్ లో రీతూ వర్మనే హైలెట్ చేస్తున్నారని నాగ శౌర్యకు అసలు తగిన ప్రాధాన్యత అనేదే ఇవ్వడం లేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వైరల్ అయిన ఈ కామెంట్ల గురించి నాగ శౌర్య స్పందించి స్పష్టతనివ్వడం అనేది జరిగింది. అసలు తనకు రీతూవర్మకు గొడవ జరిగిందని వస్తున్న వార్తల్లో ఏమాత్రం కూడా నిజం లేదని సౌర్య చెప్పుకొచ్చారు. ఇక రీతూవర్మ వేరే సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదని నాగశౌర్య చెప్పడం జరిగింది.ఇక ఈ సినిమా చేసినందుకు గాను తాను చాలా గర్వపడుతున్నానని కథను బట్టి ఈ సినిమాకు నిర్మాతలు బడ్జెట్ పెట్టారని నాగశౌర్య పేర్కొనడం జరిగింది. ఇక కెమెరామ్యాన్ వంశీ వల్లే తాను ఈ సినిమాలో ఇంత అందంగా కనిపిస్తున్నానని  కూడా నాగ శౌర్య వెల్లడించడం అనేది జరిగింది. ఇక నాగ శౌర్య వరుడు కావలెను సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఇక మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: