
ఈ నేపథ్యంలోనే గీతాసింగ్ ఒక ఇంటర్వ్యూ ఛానల్లో మాట్లాడుతూ.. తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలిపారు. ఆమె ఒకానొక సమయంలో రోజుకు మూడు సినిమాల షూటింగ్లో పాల్గొంటూ ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించానని పేర్కొన్నారు. అయితే ఆ డబ్బులను ఒక టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాటలు నమ్మి చిట్టి వేశానన్నారు. సుమారు పది లక్షల రూపాయలను తన చేతిలో పెట్టానని.. అయితే చివరికి తను నిలువునా మోసం చేసి వెళ్లిపోయిందని.. ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి తెలియజేశారు.
తను కష్టపడి సంపాదించినది మొత్తం తను తినకుండా.. తన కుటుంబానికి పెట్టకుండా.. తనే స్వయంగా తీసుకెళ్లి వేరే వాళ్ల చేతిలో పెట్టానని పేర్కొంది. అలా కష్టపడిన సొమ్ము అంతా పోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లి పోయానని వెల్లడించారు. ఇక అదే సమయంలో ఆమెకు అవకాశాలు కూడా తగ్గడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు వెల్లడించారు. ఆమె కష్టపడిన కూడబెట్టిన డబ్బు మొత్తం పోగొట్టుకున్న తను ఒకనొక సందర్భంలో బాగా ఆకలి వేయడంతో తినడానికి డబ్బులు లేక గుడి దగ్గర ప్రసాదంగా పెట్టిన పులిహోర తిన్నానని ఈమె తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను వెల్లడించారు.