ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ శరణ్ 2001 నుంచి 2021 వరకు తన సినీ కెరీర్ ను ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె వివాహం చేసుకొని, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అంతే స్థాయిలో సినిమాలలో దూసుకుపోవడం అంటే అంత ఆషామాషీ కాదని చెప్పాలి. ఇక తన అందం , బాడీలాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా సినిమాలలో దూసుకుపోతూ ఉండడం అతిశయోక్తి కాదని చెప్పాలి. తాజాగా శ్రియ నటించిన చిత్రం గమనం. ఈ రోజు గమనం సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.కాకపోతే ఈ గమనం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో హాజరైన తెలుగు యంగ్ హీరో శర్వానంద్ శ్రీయ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీయ అందం గురించి పలు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇకపోతే జ్ఞాన శేఖర్ ఒక సినిమాను నిర్మిస్తున్నాను అని నాతో చెప్పినప్పుడు.. వద్దు అని నేను సలహా ఇచ్చాను. కానీ కథపై నమ్మకం ఉంది అని చెప్పి ముందుకు వెళ్ళాడు.. ఒకసారి ఈ కథ నాకు కూడా వినిపించాడు. ఇక వినగానే నాకు చాలా బాగా నచ్చింది.. ఆ సినిమానే గమనం.. నిజానికి శ్రీయ, నేను మంచి స్నేహితులము.మేమిద్దరం కలిసి నువ్వా నేనా అనే సినిమాలో నటించాము. ఇక అప్పటికీ ఇప్పటికీ తన లో ఎలాంటి మార్పు నాకు కనిపించలేదు. కింగ్ నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతే కాదు నేను ఈమెకు వీరాభిమానిని అని శర్వానంద్ తెలిపారు. ఈ సినిమా దర్శకురాలు సృజన రావు ప్రతిభ ఏంటో కూడా నాకు బాగా తెలుసని, ఆమె ఖచ్చితంగా విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాతో మొదటి సారి తెలుగు సినీ ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు సృజనా రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: