యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తన పాపులారిటీని ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు, అయితే బాహుబలి సినిమాతో ఏర్పడిన క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు, అందులో భాగంగా ఇప్పటికే  సాహో  సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి విడుదల చేసిన ప్రభాస్ ప్రస్తుతం కూడా వరుస పాన్ ఇండియ సినిమాలలో అంతకుమించిన సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నాడు, అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్.  ఈ సినిమాకు కేజిఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ గా దర్శకుడిగా పాపులారిటీని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు, అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని, ప్రభాస్ తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో యాక్షన్ సీన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి అని తెలుస్తుంది, ఇలా సలార్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలియడంతో ఈ సినిమాపై జనాల్లో క్రేజ్ మరింత పెరిగిపోయింది, ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి హసన్ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతుంది అని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్ సినిమాను పూర్తి చేశాడు, వీటితో పాటు ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నాడు, అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ లో నటించడానికి రెడీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: