ప్రస్తుతం విడాకులు అనే కాన్సెప్ట్ ట్రెండ్ అయిపోయింది అందరికి.అయితే టాలీవుడ్ అనే కాదు దాదాపు అన్ని భాషల సినీ పరిశ్రమలో ఇప్పుడు విడాకులు వార్తలు హైలెట్ అవుతున్నాయి.అంతేకాకుండా  ఎప్పుడు ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారు అనే విషయం మీద ఎవరికీ అవగాహన ఉండటం లేదు.ఇకపోతే ఇప్పటికే టాలీవుడ్ లో పలు జంటలు విడాకులు తీసుకుని ఎవరికి వారు జీవిస్తూ ఉండగా ఇప్పుడు మరో టాలీవుడ్ జంట విడాకులు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఇక  ఆ జంట మరెవరో కాదు టాలీవుడ్ గాయనీ, గాయకులు శ్రావణ భార్గవి - హేమచంద్ర. ఇకపోతే వీరు తెలుగులో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన హేమచంద్ర అనేక సూపర్ హిట్ సాంగ్స్ అందించడమే కాక అనేకమందికి తన గాత్ర దానం చేశాడు.అంతేకాక ఇటు శ్రావణ భార్గవి కూడా తెలుగులో అనేక సినిమాల్లో సింగర్ గా తన ప్రతిభను చాటింది.ఇదిలావుంటే గతంలో  వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి 2013వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కాగా వీరి ప్రేమకు గుర్తుగా శిఖర చంద్రిక అనే ఒక కుమార్తె కూడా 2016వ సంవత్సరంలో జన్మించింది.ఇకపోతే తాజాగా  నిప్పు లేకుండా పొగ రాదు అన్న హేమచంద్ర, ఇది అసలు ఎక్కడ మొదలైందో ? ఇక ఎందుకు మొదలైందో? తెలియదు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా పలు వెబ్ సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ లో పెద్ద ఎత్తున కథనాలు బయటకు వస్తున్నాయి.

అయితే సాధారణంగా అదేమీ లేకపోతే కనుక వారి నుంచి కచ్చితంగా ఖండన వస్తుంది.ఇదిలావుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇతర పోస్టులను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తున్న హేమచంద్ర ఈ విషయం మీద స్పందించకపోవడంతో ఈ ప్రచారం నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాదు మరికొందరైతే హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్ మీడియా అకౌంట్స్ లోకి వెళ్లి వాళ్ళ పోస్టుల కింద కామెంట్లు పెడుతున్నారు.అయితే  ఇలా వార్తలు వస్తున్నాయి, నిజమా లేదా? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: