ఇక మేజర్ సినిమాతో మొత్తానికి కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన అడివి శేష్ ఒక మీడియం రేంజ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు అనే చెప్పాలి. అడివి శేష్ మేజర్ సినిమా వరకు వచ్చిన విధంగా చూసుకుంటే అతనీ ప్రయాణం అంత కూడా అంత ఈజీగా అయితే ఏమి కొనసాగలేదు.మొదట అతను డైరెక్టర్ కమ్ హీరో గా సొంతంగానే అతని సినిమాలు తీసుకున్నాడు. అయితే దర్శకుడిగా ఊహించని అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ అతను రచయితగా మాత్రం చాలా మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు.చాలామంది దర్శక నిర్మాతల నుంచి కూడా అతనికి రచయితగా మంచి గుర్తింపు అనేది లభించింది. ఇక అందుకే మళ్ళీ అడవి శేష్ హీరోగానే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో అతని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఇతర హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా పంజా సినిమాలో అతను చేసిన పాత్ర అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత బలుపు ఇంకా బాహుబలి ఇలా కొన్ని సినిమాల్లో శేష్ చేసిన పాత్రలకు మంచి క్రేజ్ లభించింది.అయితే హీరోగా అడవి శేష్ చేసిన గత ఐదు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలను అందించడం విశేషం.


2016 వ సంవత్సరంలో క్షణం సినిమాతో అతను చేసిన ప్రయోగం నటుడిగానే కాకుండా రచయితగా కూడా అతనికి మంచి క్రేజ్ అందించింది. ఆ తర్వాత కామెడీ బ్యాక్ డ్రాప్ లో చేసిన మొదటి సినిమా ఆమీ తూమీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.అలాగే డిఫరెంట్ స్పై మూవీ గూడచారి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందజేసింది. ఇక ఆ తరువాత ఎవరు కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు చేసిన మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దాదాపు 20 కోట్ల వరకు ప్రాఫిట్ అందించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు కూడా అడివి శేష్ రచయితగా వర్క్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: