ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించినట్లు అయితే ఆ సినిమాకు సీక్వల్ తెరకెక్కించిన సందర్భం లో మొదటి సినిమా అప్పటికే భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సీక్వెల్ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు . అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న కారణంగా సీక్వెల్ మూవీ లకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతూ ఉంటుంది .

ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమా కనిపిస్తున్నాయి . కొన్ని సంవత్సరాల క్రితం నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన కార్తికేయ సినిమా ఎంత మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించిందో మన అందరికీ తెలిసిం దే . సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన కార్తికేయ సినిమా లో నిఖిల్ సరసన స్వాతి కథా నాయికగా నటించింది . ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ప్రస్తుతం కార్తికేయ సినిమా కు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా ను తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోం ది. 

సినిమా కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని జులై 22 వ తేదీన విడుదల చేయబోతున్నా రు.  ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన నిర్మాణా  నంతర పనులు జరుగుతున్నాయి . ఈ సినిమాను 5 బాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు.  ఈ మూవీ కి మొత్తం థియేట్రికల్ హక్కులు , శాటిలైట్ , డిజిటల్ ,  ఆడియో హక్కులు అన్ని కలుపుకుని, 34 కోట్ల కు అమ్ముడు అయినట్లు ఒక టాక్ నడుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: