అంతే కాదు సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీ పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరుకునే ప్రేక్షకులు ప్రస్తుతం కోట్లలోనే ఉన్నారు అని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల క్రితం సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ మాలో ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. ఇకపోతే సుదీర్ లేకపోవడంతో రష్మీ ఒంటరి అయిపోయింది అని అభిమానులు ఎంతగానో ఫీలవుతున్నారు. అప్పుడప్పుడు షో లో సుధీర్ ని తలచుకుంటూ ఉంటుంది రష్మీ. ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో రష్మీ సుధీర్ ని తలుచుకుని ఎమోషనల్ అవుతుంది. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపిస్తే బాగుండు అని అభిమానులు బలంగానే కోరుకుంటున్నారు.
అయితే ముందు సుధీర్ ని తలుచుకుని ఎంతో ఎమోషనల్ అయిన రష్మీ.. మనుషులు దూరంగా ఉన్నంత మాత్రాన ప్రేమ తగ్గిపోయినట్లు కాదని.. మేమిద్దరం ఎంత దూరం ఉన్నా మా ఇద్దరి మనసు ఒకేచోట ఉంటుందని రష్మీ చెప్పింది. రష్మీ చెప్పిన దాంతో అక్కడున్న వారందరూ ఫిదా అయిపోయారు. ఇక రష్మీ మాటలతో అభిమానులు కూడా మురిసిపోయారు అని చెప్పాలి.