టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమాకి ఆటో జానీ అంటూ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి పెట్టుకున్న పూరీ సినిమా కథని చిరుకి వినిపించగా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా మార్చాలని సూచించారట.అయితే ఇక తను రాసుకున్న కథని తనలానే తీయాలని చూసే పూరీ మెగాస్టార్ సజెషన్స్ లైట్ తీసుకున్నారట. అందుకే ఆటో జానీ కథ అనేది అర్ధాంతరంగా ముగిసింది. ఆ టైం లో పూరీ జగన్నాథ్ తనకి డైరెక్ట్ గా చెప్పకుండా ఎవరి దగ్గరో డిస్కస్ చేసినందుకు మెగాస్టార్ మీద నొచ్చుకున్నాడు.ఇక అదంతా జరిగిన కథ.. ఈమధ్య పూరీ జగన్నాథ్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి తరచు కలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా పూరీ జగన్నాథ్ చిన్న పాత్రలో కనిపించారట. ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న లైగర్ సినిమా ప్రమోషన్స్ కి మెగాస్టార్ చిరంజీవిని వాడేస్తున్నారు పూరీ జగన్నాథ్ .


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా సెట్ లో లైగర్ సినిమా టీం కూడా ప్రత్యక్షమైంది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీతో కలిసి చిరంజీవి ఇంకా అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే పూరీ జగన్నాథ్ తో మెగాస్టార్ చిరంజీవి క్లోజ్ గా ఉన్న ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ లో కొత్త ఆశలు అనేవి చిగురించాయి.మా మెగాస్టార్ తో ఆటో జానీ ఎప్పుడు తీస్తావ్ అన్నా ఇక ఆ సెకండ్ హాఫ్ ఏదో మార్చి బాస్ తో సినిమా ఓకే చేయించుకో అన్న. మీ కాంబినేషన్ లో సినిమా కోసం మేం చాలా వెయిటింగ్ అన్నా.. మెగా మాస్ మూవీ మాకు కావాలన్నా అంటూ పూరీ జగన్నాథ్ కి ట్యాగ్ చేస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి ఓకే చెప్పాలే కానీ పూరీ అదిరిపోయే కథ రెడీ చేయడం ఖాయం. మెగాస్టార్ చిరంజీవి మెప్పు కోసమే పూరీ జగన్నాథ్ వెయిటింగ్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: