కానీ ఇప్పడు అలా జరగడం లేదు. హిట్ సినిమాకు కూడా వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. కారణం పెరిగిన టికెట్ రేట్లేనని మరో సారి తేలింది.ఆ కారణంగానే సగటు ప్రేక్షకుడు థియేటర్లకు రావడానికి సాహసించడం లేదని ఒక్కో ఫ్యామిలీ థియేటర్ కు రావాలంటే అక్షరాలా రూ. 1500 నుంచి రూ. 2000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.పైగా అమౌంట్ లో సగం ఖర్చు చేస్తే ఇంటిల్లిపాదీ ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే 4కెలో సినిమా చూసేయొచ్చు. ఓటీటీ ల్లో రోజూ ఓ సినిమా చూసుకునే వెలుసుబాటు వుండటం వల్లే సగటు ప్రేక్షకుడు వేలు ఖర్చు చేసి థియేటర్లకు రావడానికి సాహసించడం లేదని 'గాడ్ ఫాదర్'తో మరోసారి రుజువైంది. అందుకే గాడ్ ఫాదర్ కి అనుకున్నంత వసూళ్లు రావడం లేదు. పైగా సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని జనాల రాక కోసం చిరంజీవి టీం ఫేక్ వసూళ్లతో ప్రచారం చేస్తుంది. కానీ సినిమా మాత్రం చాలా ఘోరమైన నష్టాల్లో ఉందని సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం 40 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇంకా 50 కోట్లపైగా వసూళ్లు రాబడితే సినిమా సేఫ్. కానీ అది చాలా కష్టంలాగా కనిపిస్తుంది.చూడాలి మరి సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి