ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫోటో షూట్ ఇటీవలే జరగగా ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోపోతుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా చిన్న మీడియం రేంజ్ హీరోలకు మాత్రమే దర్శకత్వం చేస్తూ వచ్చిన ప్రభాస్ తొలిసారిగా ఒక పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఆ విధంగా ప్రభాస్ రిలీఫ్ కోసమే ఈ సినిమాను చేస్తూ ఉండగా ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలే. ప్రస్తుతం కూడా నాలుగైదు సినిమాలను భారీ స్థాయిలో చేస్తున్న నేపథ్యంలో మారుతి కథను నచ్చిన ప్రభాస్సినిమా చేయడానికి అంగీకరించాడు. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది అని చెబుతున్నారు. అయితే ఈ సినిమా హారర్ అయినప్పటికీ ప్రభాస్ ను దెయ్యం ఆవహించడం తో ఆయన దెయ్యం లా నటిస్తున్నాడని చెబుతున్నారు. అయితే దయ్యంలా నటించినా కూడా అందరిని భయపెట్టకుండా ఈ సినిమా ద్వారా ఆయన నవ్వుల పువ్వులు పూయిస్తాడని అంటున్నారు. 

ఇక ఆయన హీరోగా నటించిన ఆది పురుష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా మైథాలజికల్ చిత్రంగా భారీ బడ్జెట్ తో రూపొందగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ సినిమా తెరక్కింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు సలార్ అనే సినిమాను తీసుకురాబోతున్నాడు. వచ్చే ఏడాది వేసవి లో ఆ సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఆ విధంగా సలార్ చిత్రం తర్వాత ఇప్పుడు చేస్తున్న మారుతి సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు ప్రభాస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: