అంతేకాదు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఖైదీ సినిమా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు నాల్గవసారి భారీ బడ్జెట్తో హీరో విజయ్ దళపతి తో సినిమాను తెరకెక్కించబోతున్నారు లోకేష్.. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో సాయి పల్లవి, సంజయ్ దత్, పృథ్విరాజ్ సుకుమారన్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ మీనం తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదిలా వుండగా ఈ సినిమా క్లైమాక్స్ ఏంటో.. ఇంకా మొదలు పెట్టక ముందే రివీల్ చేసేసారు లోకేష్. అయితే ఈ సినిమా మొదలుకాకముందే సినిమాపై అంచనాలు పెంచడానికి లోకేష్ ఇలా అసలు విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది.
లోకేష్ నుండి వస్తున్న ఈ సినిమా మళ్లీ డ్రగ్స్, మాఫియా అంశాల చుట్టూనే తిరుగుతుంది. ఇందులో హీరో విజయ్ ఎల్సియులో చేరతారని, చివర్లో కమల్ హాసన్, సూర్య, కార్తీ, విజయ్ల మధ్య గొడవ జరుగుతుందని లోకేష్ ధృవీకరించారు. ఇంత పెద్ద స్టార్ హీరోలు తెరపై పోటీ పడడం ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.