ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి పరిచయం అవసరం లేదు . మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని బేబమ్మగా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలలో కూడా నటించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. కథల ఎంపిక విషయంలో మొదట్లో పర్ఫెక్షన్ చూపించిన కృతి శెట్టి.. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసింది. ఈ క్రమంలోని ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి వరుస సినిమాలతో డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.


అయితే తాజాగా ఇప్పుడు మరొకసారి నాగచైతన్య తో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. NC22 వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాలో నాగచైతన్య సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. సినిమా అవకాశాలు లేక సమయాన్ని ఖాళీగా గడుపుతోందని ఈమె కెరియర్ డౌన్ అయినట్టే అని అందరూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక హిట్ డైరెక్టర్ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అసలు విషయంలోకి వెళ్తే .. స్క్రీన్ రైటర్ గా,  దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరాం ఆదిత్య 2015లో భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన శమంతకమణి , దేవదాస్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించగా.. ఇటీవల గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా వచ్చిన హీరో సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. ఈ నేపథ్యంలోని శర్వానంద్ తో  సినిమాకి సిద్ధమైన శ్రీరామ్ ఆదిత్య.. ఇందులో కృతి శెట్టిని హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం.  ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ ఆమె కెరియర్ దూసుకుపోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: