హీరో రానా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపుని దక్కించుకున్న విషయం తెలిసిందే.
బాహుబలి సిరీస్ తో ఆయన తన రేంజ్ బాగా పెరిగింది.. ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం సూపర్ హిట్ కూడా అయ్యింది.కానీ ఆ తర్వాత రానా సినిమాలకు బాగా దూరమయ్యాడని తెలుస్తుంది.

అందుకు కారణం ఆయనకీ ఉన్న ఆరోగ్య సమస్యలే అని పలు ఇంటర్వ్యూస్ లో బాహుబలి తర్వాత వరుసగా సినిమాలు చేసి ఉంటే ఈరోజు నా రేంజ్ కూడా ఎవ్వరు ఊహించని స్థాయిలో ఉండేది, పూర్తి నా బ్యాడ్ లక్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నాడు. వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు కూడాచేస్తున్నాడు రీసెంట్ గానే ఆయన తన బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి 'రానా నాయుడు' అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా నటించాడు.

ఈ సందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ మాట్లాడుతూ 'మీరు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురుకున్నారని, మీ కిడ్నీ లు మార్పిడి కూడా జరిగిందని మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది, దీనిపై మీ స్పందన ఏమిటి' అని అడగినట్లు సమాచారం.రానా దానికి సమాధానం చెప్తూ 'నిజమే ఆరోగ్య పరంగా నేను చాలా ఇబ్బందులనే ఎదురుకున్నాను,నా జీవితం లో నేను చూసిన అతి దరిద్రమైన రోజులు అవే, కానీ ఆరోజులు నాకు ఎంత కఠినతరమైన సమస్యలు వచ్చినా కూడా ఎలా ఎదురుకోవాలి అనేది నాకు నేర్పించింది' అంటూ రానా చెప్పుకొచ్చాడటా.

తన ఆరోగ్యం మొత్తం కుదుట పడిన తర్వాత మిహీక బజాజ్ అనే అమ్మాయిని రానా పెళ్లాడాడు. సినిమాలు కూడా వరుసగా చెయ్యడం అయితే ప్రారంభించాడు.ప్రస్తుతం ఆయన రానా నాయుడు వెబ్ సిరీస్ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: