గత కొంత కాలంగా సూర్య జ్యోతిక వేరు కాపురం గురించి ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూర్య జ్యోతిక క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకోగా సూర్య వరుస విజయాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాల విజయాల తో మార్కెట్ ను పెంచుకున్న సూర్య ప్రస్తుతం కంగువా అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.సూర్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. స్కంద మూవీ విడుదలైన తర్వాత సూర్య బోయపాటి శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సూర్య సోదరుడైన కార్తీ తాజాగా జ్యోతిక గురించి సూర్య జ్యోతిక వేరు కాపురం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కార్తీ మాట్లాడుతూ జ్యోతిక ను నేను ఎప్పుడూ నటి గా చూడలేదని కామెంట్లు చేశారు. నేను ఆమెను అమ్మ గా మాత్రమే చూశానని పేర్కొన్నారు. జ్యోతిక కూడా మమ్మల్ని పిల్లల్లా చూసిందని సూర్య చెప్పుకొచ్చారు. అమ్మ ప్రస్తుతం ముంబై లో ఉండటం తో మా ఇల్లు బోసిపోయిందని కార్తీ కామెంట్లు చేశారు. అమ్మ తో కలిసి ఉన్నప్పుడు సంతోషం గా ఉన్నామని కార్తీ తెలిపారు.ఇన్ని సంవత్సరాల పాటు తామందరం కలిసి ఉన్నామంటే కారణం జ్యోతిక నే అని కార్తీ కామెంట్లు చేశారు. అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లు అవుతుండటం తో చదువల కోసం వాళ్లు ముంబై కి వెళ్లారని చదువులు పూర్తైన తర్వాత తప్ప కుండా కలిసే ఉంటామని ఈలోపు ప్రతి పండుగ కు కలుస్తూ ఉంటామని కార్తీ చెప్పారు. కార్తీ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: