నెట్ ఫ్లిక్స్ అధినేత టెడ్ సరండోస్ ఇండియాకు గత కొద్ది రోజుల క్రితం రావడం జరిగింది. ఇందులో వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలను కలుస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు.చిరంజీవి ,రామ్ చరణ్,ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల శివ, మహేష్ బాబు, సుకుమార్, అల్లు అర్జున్, వెంకటేష్ ,ప్రభాస్ ,నాగచైతన్య రాజమౌళి, దుల్కర్ సల్మాన్,మైత్రి మూవీ నిర్మాతలు తదితర సినీ సెలబ్రిటీలను సైతం ఆయన కలవడం జరిగింది.మూడు రోజుల నుంచి టాలీవుడ్ లో మీటింగ్స్ తో టెడ్ సరండోస్ బిజీగా గడిపేయడం జరిగింది.


అయితే స్టార్ సెలబ్రిటీల అందరిని కలిసి వారి తో ముచ్చటించి సినిమాల గురించి నెట్ఫ్లిక్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోందట. అంతేకాకుండా త్వరలోనే తెలుగు మరియు ఇతర దక్షిణాది భాషలలో కూడా ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లతో రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ అధినేత ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలను కలవడం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో కలిసి టెడ్ సరండోస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.


టాలీవుడ్ మీటింగ్స్ తో అయ్యాక ceo టెడ్ సరండోస్ స్టార్ హీరోలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి తాను గత మూడు రోజుల క్రితం తెలుగు సినీ లెజెండరీలను సైతం కలవడం జరిగింది. వాళ్ల స్టోరీలు సినిమా పైన వారికి ఉన్న డెడికేషన్ చూసి నేను ఆశ్చర్య పోయాను అంటూ తెలిపారు.. ఇలాంటి లైఫ్ టైం అనుభవం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియ జేయడం జరిగింది. దీంతో వరల్డ్ టాప్ ఓటిటి టెడ్ సరండోస్ ఇలా స్టార్స్ గురించి పోస్ట్ షేర్ చేయడం తో అభిమానులు సైతం తెగ ఆనంద పడుతూ ఉన్నారు. ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రతి ఒక్కరు కూడా మంచి పాపులారిటీని అందుకుంటున్నారని చెప్ప వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: