ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ మధ్య అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇవి ఈ సినిమాకి హైలైట్ గా ఉండనున్నాయట. సైఫ్ అలీ ఖాన్ టీమ్ మాత్రం తన గాయాల గురించి ఎటువంటి సమాచారాన్ని తెలుపలేదు. కేవలం బాలీవుడ్ మీడియాలోనే వినిపిస్తున్నాయి. ఈ వార్త తెలుసుకున్న సైఫ్ అలీఖాన్ అభిమానులు సైతం తాను త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు. గతంలో కూడా సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ నటించిన అది పురుష్ సినిమాలో రావణాసురుడిగా నటించారు.
ఇప్పుడు దేవర తో మరొకసారి తెలుగులోకి అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తూ ఉండగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తూ ఉన్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దాదాపుగా రూ .300 కోట్ల భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తలకెక్కిస్తూ ఉండడం గమనార్హం. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్ర బృందం.. అయితే ఈ సినిమా సమయానికి ఎలక్షన్స్ వస్తున్నాయని దీంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.మరి ఇంతవరకు చిత్ర బృందం ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి