పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు.. ఈ సినిమా కొన్ని కారణాల చేత ఇప్పటికీ వాయిదా పడుతూనే వస్తోంది. సినిమా పైన మాత్రం భారీగా అంచనాలైతే ఏర్పడ్డాయి.ఇప్పటివరకు సినిమా షూటింగ్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఎన్నికల వల్ల బిజీగా ఉండడం చేత కొన్నాళ్లుగా సినిమాలు అన్నిటిని పక్కనపెట్టి కేవలం రాజకీయాల వైపే అడుగులు వేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి హరిహర వీరమల్లు సినిమా పైన అప్డేట్లను చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది.


గడిచిన రెండు రోజుల క్రితం ధర్మం కోసం యుద్ధం అనే పోస్టర్తో ఒక టీజర్ వస్తుందంటూ చిత్ర బృందం వెల్లడించింది.. మొట్టమొదటి ఇది పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పీరియాడికల్ సినిమా కావడంతో అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగానే తాజాగా హరిహర విరమణ సినిమా నుంచి టీజర్ విడుదల అయింది. టీజర్ లో మొఘల్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటు ఉంటే వాళ్ళని దోచుకోవడానికి ఒక దొంగ వస్తాడు 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథ అన్నట్లుగా చూపించారు.


మొత్తానికి హరిహర వీరమల్లు టీజర్ అయితే అదిరిపోయేలా కనిపిస్తోంది. పవన్ యాక్షన్స్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ అయితే జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చివరిలో చూపించారు.. టీజర్ తోనే ఒక్కసారిగా హరిహర వీరమల్లు సినిమా పైన భారీ హైప్స్ ఏర్పరిచిన డైరెక్టర్ క్రిష్ మరి ఏ మేరకు ఈ సినిమాని ఆకట్టుకునేలా ఉంటుందో చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ డేట్ అని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాబీ డియల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: