శ్రీకాంత్ ,  వరలక్ష్మి శరత్‌కుమార్ , రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో తేజా మార్ని దర్శకత్వంలో కొంత కాలం క్రితం "కోట బొమ్మాలి పి ఎస్" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పోయిన సంవత్సరం నవంబర్ నెలలో మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నిర్మాత థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటికే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సినిమా కావడంతో ఈ మూవీ పై "ఓ టి టి" ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ లో టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయింది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలుబడింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: