టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత మళ్లీ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో కలిసి కనిపించింది .. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఈ విషయాన్ని మరోసారి బయటపెట్టింది .. ఇక ఇందులో ఆమె జిమ్‌లో వర్కవుట్స్‌ చేయడం తో పాటు పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది .. అలాగే దర్శకుడు రాజ్‌ నిడిమోరు కూడా పికిల్ బాల్ ఆడుతూ కనిపించారు .. అయితే ఇంకేముంది అలా మరోసారి ఇద్ద‌రు కలిసి జంటగా కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్లు ఊపందుకున్నాయి .. ఇక రీసెంట్ గా శుభం సినిమా రిలీజ్ తర్వాత కూడా రాజ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పంచుకుంది ..


ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి .. ఇక ఇప్పుడు మళ్లీ పికిల్ బాల్ ఆడుతూ కనిపించడంతో ఈ డేటింగ్  రూమర్లకు మరింత బలం చేకూరింది .. ఇక ప్రస్తుతం సమంత , రాజ్ పికిల్ బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .. అలాగే దీనిపై సినీ అభిమానులు నెటిజన్లు పలు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు .. అలాగే ఈ వీడియో వైరల్ కాగానే డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి కూడా ఒ పోస్ట్ పెట్టింది .. ‘అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది’  అంటూ సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ పెట్టింది ..


అలాగే గతంలో కూడా ఎవరి పేర్లు చెప్పకుండా సామ్- రాజ్ డేటింగ్ రూమర్ల పై ఇలానే సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది .. అలాగే గతంలోనూ పలు సందర్భాల్లో జంటగా కనిపించినప్పుడు రాజ్ , సమంత అయితే ఇప్పటివరకు తమపై వస్తున్న డేటింగ్ రూమర్లపై ఎప్పుడు స్పందించలేదు .. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సమంత రాజ్‌ ప్రస్తుతం  ‘రక్త్‌ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ మనే కొత్త వెబ్ సిరీస్ కోసం కలిసి పని చేస్తున్నారు .. ఇక ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, వామికా గబ్బి, అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ..





మరింత సమాచారం తెలుసుకోండి: