బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీ . ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత బాగా తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకునిందో సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే రేంజ్ లో ముందుకు కొనసాగుతుంది.  ఎంత అందంగా ఉంటుందో అంతే చక్కగా నటిస్తుంది . తాజాగా కాజోల్ నటిస్తున్న మూవీ "మా". ఈ సినిమాకు విశాల్ పురియా దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రంలో రోనిత్ బోస్ రాయ్,  ఇంద్రనీల్ సేన్ గుప్తా కీలక పాత్రలో కనిపించబోతూ ఉండడం విశేషం.


"మా" చిత్రానికి అజయ్ దేవగన్  , జ్యోతి దేశ్ పాండే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు . అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ నేపథ్యంలోనే సినీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజోల్ షాకింగ్ కామెంట్స్ చేసింది . అది కూడా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి కావడంతో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . "ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంలో రామోజీ ఫిలిం సిటీ ఒకటి " అంటూ "తన జీవితంలో అక్కడికి వెళ్లాలనుకోవడం లేదు " అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి .



కాజల్ మాట్లాడుతూ.." ఎందుకో తెలియదు రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ వచ్చాయి . కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు చాలా బాగుంటాయి.  అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి . కొన్ని ప్రదేశాలు భయపెడతాయి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది . అక్కడికి మరోసారి రాకూడదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది.  హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ కూడా అలాంటిదే.  ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది " అంటూ కాజోల్ చెప్పుకొచ్చింది . దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  ఎందుకు ఆమె రామోజీ ఫిలిం సిటీపై అలాంటి కామెంట్స్ చేసింది ..? అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందా..? అనే విధంగా సోషల్ మీడియా ద్వారా జనాలు మాట్లాడుకుంటున్నారు.  మరి కొంతమంది అది ఓ దెయ్యాల కొంప అని ..  కాజోల్ చెప్పకనే చెప్పేసింది అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఎవ్వడు అక్కడ సినిమా షూటింగ్ చేస్తాడు ..? అంటూ ఘాటుఘాటుగా స్పందిస్తున్నారు. కాజోల్ ఎందుకు రామోజీ ఫిలిం సిటీపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో అర్థం కావడం లేదు . ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె ఆడుతున్న హై డ్రామా అంటూ కొంతమంది కొట్టి పడేస్తున్నారు . ఇప్పటి వరకు అక్కడ ఎన్నో సినిమా షూటింగ్ లు జరిగాయి . ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలా మాట్లాడలేదు. కాజోల్ మాత్రమే ఇలాంటి నిందలు వేసింది. దీనిపై కాజోల్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి..!??

మరింత సమాచారం తెలుసుకోండి: