- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

దర్శకధీరుడురాజమౌళి , మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తూ నిర్మించబోతున్నారు .. అలాగే ఈ సినిమా లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా పై రోజుకొక రూమర్ బయటకు వస్తూనే ఉంది .. అయితే ఇప్పుడు తాజా బజ్ ప్రకారం వచ్చే షెడ్యూల్ లో  ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ ప్లాన్ చేయబోతున్నారట .. అలాగే ఈ సీక్వన్స్ కోసం మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతుంది .. ఇక వీరిద్దరి పాత్రల పరిచయాల తో పాటు కథ తాలూకు గమనాన్ని కూడా ఈ సీక్వెన్స్ లో రివిల్ చేస్తారని అంటున్నారు ..

అయితే రీసెంట్ గా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ప్రధానంగా నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్‌ స్మిత్‌ కు  పెద్ద అభిమానులం .. అందుకే ఆయన పుస్తకాల ఆధారం గానే ఈ సినిమా స్క్రిప్ట్ ను తయారు చేశామంటూ చెప్పుకొచ్చారు .. అయితే ఇప్పుడు రాజమౌళి , మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా  రాబోతుంది .. అలాగే ఈ సినిమా కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు .  రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించ గా మరో డైరెక్టర్ దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: