గడిచిన కొన్ని నెలల క్రితం విదేశాలనుంచి బంగారు స్మగ్లింగ్ చేస్తూ చిక్కిన  కన్నడ నటి రన్యారావు చిక్కడంతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమను ఉలిక్కిపాటికి గురిచేసింది. అయితే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉన్నది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బంగారం అక్రమ రవాణాకు సంబంధించి అలాగే మనీలాండరింగ్ కేసులో కూడా ఈనటి సుమారుగా 30 కోట్లకు పైగా రన్యారావుకు ఉండే ఆస్తులను సైతం ఈడి అధికారులు జప్తు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


రన్యారావు బెంగళూరులో విక్టోరియా లేఅవుట్లో ఒక ఇల్లుతో పాటుగా ఆర్కావతి లేఅవుటులో మరొక నివాసం ఉన్నదట.. అలాగే అనేకల్ తాలూకాలో ఉండేటువంటి వ్యవసాయ భూమి.. అలాగే తుమకూర్ లో ఉండే మరొక భూమిని మనీ లాండరింగ్ చట్టం కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటన్నిటి ఆస్తి మొత్తం విలువ సుమారుగా 34.12 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. తన నెట్వర్క్ ఏజెంట్ల ద్వారా సుమారుగా 13 కోట్ల రూపాయలు విలువైన 14 కేజీల బంగారాన్ని సైతం అక్రమంగా దుబాయ్ నుంచి బెంగళూరుకు తరలిస్తూ ఉండగా విమానాశ్రయంలో ఈమెను పట్టుకోవడం జరిగింది.


అయితే అరెస్టు అనంతరం సుదీర్ఘకాలంగా జైలు జీవితాన్ని గడిపిన రన్యారావు ప్రస్తుతం సిబిఐ, డిఆర్ఐ  అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నారు. నేరపురితంగానే డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం కారణంగా ఏమైనా అరెస్టు చేశారు అధికారులు. రన్యారావు స్మగ్లింగ్ కేసులో ఒక తెలుగు నటుడు ప్రమేయం కూడా ఉందని అతని కూడా పోలీసు అధికారులు విచారించినట్లు దర్యాప్తులో భాగంగా తెలియజేశారు. ఆ నటుడుతో కలిసి రన్యారావు చాలాసార్లు విదేశాలకు వెళ్లి వచ్చినట్లుగా కూడా అధికారులు ధ్రువీకరించారు. బ్యాంకు లావాదేవీలతో పాటుగా , వాట్సాప్ చాట్లు, పలు రకాల బిల్లులను కూడా కేసు దర్యాప్తుల ఉంచినట్లు సమాచారం. ఈ కేసులో నటి  వేడుక అప్లై చేసిన కూడా కోర్టు మంజూరు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: