
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతుంది. ఆ తర్వాత రెండేళ్లకు వచ్చిన బాహుబలి 2 సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా దశ దిశ ని మార్చేశాయి. బాహుబలి 1 రిలీజై 10 ఏళ్లు అయిన సందర్భంగా.. రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. దీనికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. ఈ సందర్భంగా యూనిట్లోని కీలక సభ్యులు అందరూ ( అనుష్క తప్ప ) గెట్ టు గెదర్ అయ్యారు. మరోసారి ఆ సినిమా అనుభవాలు, అనుభూతులు నెమరు వేసుకున్నారు. ఇక రెండు భాగాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరిట అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని కొన్ని అదనపు సన్నివేశాలు కూడా యాడ్ చేస్తున్నారు.
అక్టోబర్లో రీ రిలీజ్ అంటూ ఇప్పటినుంచే దశలవారీగా ప్రచారం చేయాలని కూడా నిర్ణయించారు. రీ రిలీజ్ సినిమాకు ఇంత హంగామా ఎందుకు అంటే.. అదే టైంలో పార్ట్ 3 కూడా ప్రకటిస్తారని చర్చ నడుస్తోంది. బాహుబలి 3 ప్రణాళికను దర్శకధీరుడు రాజమౌళి అండ్ టీం ఇప్పటినుంచి సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే బాహుబలి 3 ఉండొచ్చు అని రైటర్ విజయేంద్రప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ సందర్భంలో రాజమౌళి కూడా పార్ట్ 3 వస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు అక్టోబర్లో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి కుటుంబం నుంచి ఏ విషయం వెంటనే బయటికి రాదు. ఆ కుటుంబంలో ఎవరు లీక్లు ఇవ్వరు కాబట్టి.. బాహుబలి పార్ట్ 3పై క్లారిటీ రావడానికి ఇంకాస్త టైం పట్టే అవకాశం కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు