సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ తో పోలిస్తే సక్సెస్ రేట్ కీలకమని చెప్పవచ్చు. హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ తో పాటు జ్యోతికృష్ణ ఈ సినిమా కోసం పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డైరెక్టర్ డైరెక్షన్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నీ మనసు నాకు తెలుసు ఈ దర్శకుడి డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి సినిమా.  తరుణ్, త్రిష, శ్రీయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాటలు బాగా హిట్ అయినా, కథ కథనం ఆసక్తికరంగాలేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు 2006 సంవత్సరంలో విడుదలైన కేడీ  సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో జ్యోతికృష్ణ సోదరుడు రవికృష్ణ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా ఆయనకు నిరాశనే మిగిల్చింది.

ఆ తర్వాత జ్యోతికృష్ణ  ఊ లాలాలా పేరుతొ తమిళ సినిమాను తెరకెక్కించగా 2012లో విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.  ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని  ఆక్సిజన్ పేరుతో  ఈ దర్శకుడు సినిమాను తెరకెక్కించారు.  గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత జ్యోతికృష్ణ డైరెక్షన్ లో రూల్స్ రంజన్  అనే సినిమా విడుదలైంది.

కిరణ్ అబ్బవరం హీరోగా 2023 సంవత్సరంలో  రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇలాంటి డైరెక్టర్ ను నమ్మి  పవన్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ట్రాక్ రికార్డ్ చూసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే  బాగుండేది.   దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ కు దూరంగా ఉంటె మంచిదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: