పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం నిన్నటి రోజున విడుదలై అబోవ్ యావరేజ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (ఔరంగజేబు) నటించారు. ఈ చిత్రాన్ని మొదట డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టినప్పటికీ.. ఎన్నోసార్లు ఈ సినిమా వాయిదా పడుతూ ఉండడంతో డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు.. ఈ చిత్రాన్ని నిర్మాత రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ నే బాధ్యతలు తీసుకొని దర్శకత్వం వహించారు. దీంతో ఎట్టకేలకు నిన్నటి రోజున సినిమాను విడుదల కాగా.. అదే రోజున సక్సెస్ మీట్ ని కూడా పూర్తి చేశారు చిత్ర బృందం.


హరిహర వీరమల్లు సినిమా ఫలితం పైనే సెకండ్ పార్ట్ చేయాల వద్ద అనే విషయం ఆధారపడిందంటూ గతంలో  నిర్మాత రత్నం, పవన్ కళ్యాణ్  ఉన్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ విషయం పైన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో జయసుధ కుమారుడు ఒక కీలకమైన పాత్రలో నటించారని ఆ పాత్ర గురించి సంబంధించి సెకండ్ పార్ట్ లో చాలా డీటెయిల్ గా ఉంటుందంటూ తెలియజేశారు.



ఇప్పటికే రెండో భాగానికి సంబంధించి 30% వరకు షూటింగ్ పూర్తి అయ్యిందని మిగిలిన భాగం కూడా పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల కావాలని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలియజేశారు. దీంతో అసలు ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటికీ కూడా బ్రేక్ వేసినట్టుగా కనిపిస్తోంది.  నిన్నటి రోజున నిర్మాత ఏ.ఎం .రత్నం హరిహర వీరమల్లు సినిమా హిట్ కానీ హరిహర వీరమల్లు 2 అప్పుడు చూద్దాం అన్నట్లుగా తెలియజేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్గా మారుతోంది. మరి ఈ రోజున అధికారికంగా కలెక్షన్స్ విషయాన్ని తెలియజేస్తారేమో చూడాలి. ఇలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: