
లూసీ ఫర్ 2, లోక రూ. 250 ప్లస్ కలెక్షన్స్ తో ఆల్ టైం హైయెస్ట్ గ్రోసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ . ఇక సౌత్ లోని ఇతర ఇండస్ట్రీలకు టార్గెట్ రీచ్ అయినప్పటికీ టాలీవుడ్ మాత్రం ఏడాది వెనకబడింది . ఈ ఏడాది టాలీవుడ్ లో బోల్డన్ని పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయ్యాయి . కానీ సరైన హిట్ ఇచ్చిన సినిమా మాత్రం లేదు . సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ అయినప్పటికీ పెద్ద మేర కలెక్షన్స్ రాబట్టలేదు . రూ. 300 కోట్లతో 2025 లోనే హైయెస్ట్ గ్రోసార్ తెలుగు చిత్రంగా మారిన వెంకి మూవీ ని 9 నెలల్లో కనీసం ఒక్క లోకల్ ఫిలిం టచ్ చేయలేదు .
గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్ అదే విధంగా హిట్ 3, కుబేర ఇలా ఓ పది పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నెంబర్ కోసం ట్రై చేసినప్పటికీ సాధించలేకపోయాయి . టాలీవుడ్కు ఇంకా మిగిలింది మూడు సినిమాలు మాత్రమే . ఈ మూడు సినిమాలు మూడు నెలల్లోనే నిరూపించుకోవాల్సి ఉన్నాయి . ఇందుకోసం ఆల్రెడీ ఈ మూవీస్ ప్రిపరేషన్ లో ఉన్నాయి . ఇక ఓజి థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే . హరిహర వీరమల్లు తో ఫ్లాప్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంతో ఆ లెక్క సరి పెడతాడో లేదో చూడాలి . తొలిరోజు సుమారుగా 150 కోట్లు ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో 500 మార్క్ అందుకుంటుందేమో వేచి చూడాలి .