తెలుగుదేశం పార్టీ అనగానే గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. ఆయన సృష్టించిన పార్టీ కేవలం రాజకీయ బలమే కాదు – ఆత్మగౌరవం, తెలుగుదనం ప్రతీకగా నిలిచింది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత చరిత్రలో నిలిచిపోయింది. ఆయన వేసిన పునాదులే ఈ రోజు టీడీపీని పటిష్ట భవనంలా నిలబెట్టాయి. ఆ పునాదులు బలంగా ఉన్నందువల్లే ఈ పార్టీ దశాబ్దాల గడిచినా ఇంకా ప్రజల్లో అదే పాప్యులారిటీని కొనసాగిస్తోంది. ఎన్టీఆర్ తర్వాత టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్ళాయి. హరికృష్ణ రాజకీయాల్లో చురుకుగా ఉన్నా చివరికి పార్టీలో అంతగా స్థిరపడలేకపోయారు. ఆయన ఎన్టీఆర్ చైతన్య రథం సారధిగా టీడీపీ జెండాను ప్రజల్లోకి చేర్చినా, ఆ కృషికి తగిన స్థానం దక్కలేదు.
 

మరో వైపు బాలకృష్ణ మాత్రం సినిమాలతో పాటు టీడీపీ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ తరఫున ఎగిసిపడుతూ ప్రజల్లోకి వెళ్లారు. కానీ మంత్రి పదవి మాత్రం ఆయనకు దక్కలేదనే నిరాశ అభిమానుల్లో ఇంకా ఉంది. 2014, 2019, 2024 - మూడు సార్లు హిందూపురం నుంచి గెలిచిన బాలయ్య ఇప్పుడు టీడీపీకి బలమైన సింబల్‌గా నిలిచారు. రాజకీయాల్లో ఆయన క్రమంగా బలపడుతున్నా, అధికారంలో పదవి దక్కకపోవడం అభిమానులను అసహనానికి గురి చేస్తోంది. “ఇతరులు ఒక్కసారే ఎమ్మెల్యేలయ్యి మంత్రులైతే, బాలయ్య ఎందుకు కాదు?” అన్న ప్రశ్న సోషల్ మీడియాలో విస్తరిస్తోంది. తాజా అసెంబ్లీ వ్యాఖ్యలపై జరిగిన వివాదం ఇప్పుడు కొత్త మంటలు రేపుతోంది. ఒక ప్రముఖ చానల్ బాలయ్యపై యాంటీగా రిపోర్ట్ ఇచ్చినందుకు అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

 

నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం - ఇలాంటి కథనాల వెనుక ఒక రాజకీయ అజెండా దాగి ఉందని అంటున్నారు. “బాలయ్యను దించి, నందమూరి బంధాన్ని బలహీనపరచే ప్రయత్నమా ఇది?” అనే చర్చ కూడా మొదలైంది. ఏమైందేమో గాని, ఎన్టీఆర్ వేసిన పునాదులపై నిలిచిన టీడీపీకి నేటి రోజుల్లో నందమూరి వారసత్వం ప్రాణాధారంగా ఉంది. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఏకైక వ్యక్తి బాలయ్యనే అని అభిమానులు గర్వంగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎపిసోడ్ తాత్కాలికమని, మళ్లీ బాలయ్య అగ్ని స్ఫూర్తిగా మైదానంలోకి దిగితే టీడీపీకి మరో ఊపు వస్తుందని నమ్ముతున్నారు. మొత్తానికి - ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదిపై బాలయ్య కొనసాగిస్తున్న నందమూరి వారసత్వమే టీడీపీ భవిష్యత్తు దిశని నిర్ణయించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: