దాదాపు 10 సంవత్సరాలకు పైగా విరామం తీసుకున్న ఆమె, 2024లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్తో రీఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తిరిగి తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా కంగనా రనౌత్ నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాలో ఆమె చేసిన పాత్ర మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే సంజయ్ మిశ్రా, దుర్లభ్ ప్రసాద్లతో కలిసి మరో కీలక సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా… ప్రస్తుతం ఆమెకన్నా ఎక్కువ హైలైట్ అవుతున్న వ్యక్తి ఆమె కూతురు ఆర్యనా చౌదరి. కేవలం 18 ఏళ్ల వయసులోనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ స్టార్ కిడ్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఆమె గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
ఇక ఆ ఫోటోలలో ఆర్యనా తన తల్లి మహిమాను పూర్తిగా రీప్లికా లా కనిపించగా, “ఇండస్ట్రీలోకి వచ్చే నెక్స్ట్ స్టార్ హీరోయిన్ ఇదే” అంటూ నెటిజెన్లు ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నారు. తల్లితో కలిసి ఫ్యాషన్ ఈవెంట్స్, సినీ పార్టీల్లో తరచూ కనిపిస్తున్న ఆర్యనా… తానే కానీ స్టార్ మేటీరియల్ అని ప్రూవ్ చేస్తోంది. బాలీవుడ్లో ఇప్పటికే పలు నిర్మాతలు ఆమెను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఆర్యనా కూడా తల్లి అడుగుజాడల్లో నడిచి వెండితెర మీద నటిగా ఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు యూత్ హార్ట్థ్రాబ్గా నిలిచిన మహిమా… ఇప్పుడు తాను కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తూనే, తన కూతురిని కూడా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి రెడీ అవుతుండటం, అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. మహిమా & ఆర్యనా—ఈ మదర్-డాటర్ డ్యుయో ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి