'పాంచ్ మినార్' చిత్రం పూర్తిగా ఒక క్రైమ్ కామెడీగా రూపొందినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ జానర్కు కావాల్సిన కన్ఫ్యూజన్, కామెడీ టైమింగ్, డబ్బు చుట్టూ తిరిగే కథాంశం... లాంటి అన్ని ఎలిమెంట్స్ ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. కథానాయకుడు (రాజ్ తరుణ్)కి ఉద్యోగం చేయడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కానీ, తాను ప్రేమించిన అమ్మాయి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఉద్యోగంలో చేరతాడు. అక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది.ఒక మాఫియా బ్యాచ్కి సంబంధించిన భారీ మనీ బ్యాగ్ హీరో చేతికి చిక్కుతుంది. ఆ తర్వాత ఆ డబ్బు కోసం మాఫియా వెంటపడడం, హీరో పారిపోవడం, ఆ క్రమంలో వచ్చే నవ్వుల సునామీ... ఈ కథాంశం మొత్తానికి కీలకం. ఆ డబ్బుతో రాజ్ తరుణ్ ఎలాంటి మలుపులు తిరిగాడు, మాఫియా నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది థియేటర్లో చూడాల్సిందే!
రాజ్ తరుణ్ పాత్రను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. తనకున్న సహజమైన టైమింగ్తో ఈ పాత్రలో ఇమిడిపోయాడు. ఇక ఈ క్రైమ్ కామెడీకి అదనపు బలం.. సినిమాలోని ఇతర కీలక నటులే. బ్రహ్మజీ, అజయ్ ఘోష్, సుదర్శన్ లాంటి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు ఈ సినిమాలో ఉన్నారు. ఇలాంటి సినిమాలకు హాస్యం పండితే.. అది ప్రేక్షకులకు పైసా వసూల్ అవుతుంది!ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై రాజ్ తరుణ్ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తేనే.. రాజ్ తరుణ్ కెరీర్ ట్రాక్లోకి వస్తుంది. అందుకే నిర్మాతలు రిలీజ్కు ముందు ప్రీమియర్స్ వేసి సినిమాపై మరింత హైప్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఈ పాంచ్ మినార్.. రాజ్ తరుణ్ కెరీర్కు నిజమైన మలుపు అవుతుందో లేదో చూడాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి