అత్యంత ప్రతిష్టాత్మక ఒబామా
ఫౌండేషన్ ఫెలోషిప్ కి విజయవాడకి చెందిన తరుణ్ చెరుకూరి ఎన్నికయ్యారు. తరుణ్
ఎన్నికవ్వడం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా
10 దేశాలనుంచీ 20 మంది ఈ ఫెలోషిప్ కి
ఎంపిక అవ్వగా ఆ 20 మందిలో తరుణ్ చెరుకూరి ఒకరు.
ఇదిలాఉంటే భారతదేశం నుంచీ ఎన్నికైన ఏకైక వ్యక్తి, అందులోనూ తెలుగు వాడిగా రికార్డ్ క్రియేట్ చేశారు తరుణ్.అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తరుణ్ కి ఫెలోషిప్ను అందజేయనున్నారు. తరుణ్ స్వచ్చంద సేవకుడిగా ఎంతో మందికి పరిచయం అయిన వ్యక్తే..
ఢిల్లీ కేంద్రంగా ఇండస్ యాక్షన్ పేరిట ఓ స్వచ్చంధ సంస్థని ఏర్పాటు చేసి, RTI అమలుకు ఎనలేని కృషి చేసిన వ్యక్తిగా తరుణ్ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపారు. ఇప్పటి వరకు 90 వేల మంది పేద విద్యార్థులను RTI పరిధిలో తీసుకువచ్చి స్కూల్స్ లో చేర్పించారు.