గత కొంతకాలం నుంచి ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం వేధిస్తూ ఉన్నప్పటికీ అటు దేశ ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తూ అర్థ నాదాలు చేస్తున్నప్పటికీ అవన్నీ పట్టించుకోని కిమ్ జాంగ్ ఉన్.. ఇక వరుసగా క్షిపణులను ప్రయోగించడం లాంటివి చేస్తూ ఉన్నాడు. అగ్ర దేశమైన అమెరికా ఉత్తర కొరియా పై ఆంక్షలు విధిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఆ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు అని చెప్పాలి. ఇక ఇటీవలే మరోసారి సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి నీ కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగంలో కిమ్ కు ఊహించని షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది.
ఉత్తర కొరియా రాజధాని నగరం నుంచి ప్రయోగించిన క్షిపణి గాలిలో పేలిపోయి విఫల ప్రయోగం గా మిగిలిపోయింది. తన అమ్ముల పొదిలోని అతిపెద్ద సుదూర లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి ప్రయోగించింది ఉత్తర కొరియా ప్రభుత్వం. కానీ ఇది ఫెయిల్ అయింది. అయితే ఈ ఏడాది ఉత్తరకొరియా జరిపిన వాటిలో ఇది పదవ ప్రయోగం కావడం గమనార్హం. ఇక తన ఆయుధాలను ఆధునీకరించుకుంటున్న ఉత్తర కొరియా ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావాలని వ్యూహంతో ముందుకు సాగుతుందని తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి